CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం నిర్ణయించారు. ఏప్రిల్ 2వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పండుగ కావడంతో ఆ రోజు కొత్త మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన ప్రస్తుతం ఉన్న మంత్రివర్గ సభ్యులు విస్తరణకు సహకరిస్తూ రాజీనామా చేయనున్నారు. మంత్రులు ఈ నెల 27వ తేదీన రాజీనామా చేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఉన్న మంత్రులందరూ రాజీనామా చేయనున్నారు. అయితే పాత వారిలో నలుగురురి తిరిగి కేబినెట్ లోకి తీసుకోనున్నారనీ వారి చేత మరో సారి ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు.
CM YS Jagan: పార్టీ కేంద్ర కార్యాలయం బాద్యతలు విజయసాయిరెడ్డికి..?
కొత్త మంత్రివర్గంలోనూ అయిదుగురు డిప్యూటి సీఎంలు ఉంటారు. హోంశాఖ మంత్రి పదవి మళ్లీ మహిళకే కేటాయిస్తారని సమాచారం. పార్టీ కేంద్ర కార్యాలయం బాద్యతలను విజయసాయిరెడ్డికి అప్పగిస్తారని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడు ఉన్న మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలలో ఒకరిని జగన్ కొత్త మంత్రివర్గంలోనూ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలలోని కొందరికి మంత్రి పదవులు వరించనున్నట్లు తెలుస్తోంది.
Read More: AP Assembly: ఇక గీత దాటితే వేటే..!అసెంబ్లీలో కొత్త రూలింగ్
CM YS Jagan: ప్రాంతీయ మండళ్లకు చైర్మన్లు
ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఉంటుందని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్..ఇకపై పార్టీ పైనా దృష్టి సారించాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో భాగంగా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై జగన్ దిశానిర్ధేశం చేస్తున్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ మండళ్లు గురించి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిపదవుల నుండి తప్పించిన వారిలో కొందరిని ప్రాంతీయ మండళ్లకు చైర్మన్ లుగా నియమించనున్నారు.