CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ రధాన్ని పురుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, కరోనా కష్టకాలం వచ్చినా నవరత్న పథకాలను కొనసాగిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పని చేస్తున్న వార్డు, గ్రామ వాలంటీర్లకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక ప్రకటన చేశారు సీఎం వైఎస్ జగన్. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
CM YS Jagan: సిబ్బంది ఛాలెంజ్ గా తీసుకుని
ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోక్స్ మోడల్ ను జగన్ పరిశీలించారు. ఆరోగ్య శ్రీలో మరింత సలువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్స్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక ముఖ్యమంత్రిగా తాను లక్ష్యాలను నిర్దేశిస్తే ఆ లక్ష్యాలను అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పని చేయాలన్నారు. శాఖాధికారులు, వారి కింద పని చేస్తున్న సిబ్బంది ఛాలెంజ్ గా తీసుకుని ఆశించిన మార్పుల సాధనకు సీరియస్ గా పని చేయాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు అందించాలని ఆదేశించారు.
ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు
ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్లు అవుతుందని అన్నారు జగన్. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆ రోజున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, ఆరోగ్య శ్రీ సీఈఓ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?