NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా వండరే..థ్యాంక్స్ చెప్పిన ఎంపి మోపిదేవి

CM YS Jagan: అధికారంలో ఉన్న రాజకీయ నేతలు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలంటే అందులో రాజకీయ ప్రయోజనం కూడా చూసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఆ నియోజకవర్గ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ ఆవిర్భావం నుండి ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి గెలవలేదు. కానీ ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యుడు మోడిదేవి వెంకట రమణ వినతికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.

CM YS Jagan key decision on Repalle
CM YS Jagan key decision on Repalle

CM YS Jagan: రెవెన్యూ డివిజన్ కేంద్రంగా రేపల్లె

విషయంలోకి వెళితే.. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో గుంటూరు జిల్లా రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటునకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రేపల్లె నియోజకవర్గం నుండి మోదిదేవి వెంకట రమణ 2009 ఎన్నికల్లో ఒక్కసారే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు 1989,1994లో కూచినపూడి స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినా ఆ తరువాత జరిగిన 1999,2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోపిదేవి.. రేపల్లె నుండి 2014,2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఇక్కడ టీడీపీ నుండి అనగాని సత్యప్రసాద్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. మోపిదేవి వెంకట రమణ రెండు పర్యాయాలు రేపల్లే నుండి ఓడిపోయినప్పటికీ అత్యంత సన్నిహితుడు, పార్టీ పట్ల విధేయత కారణంగా జగన్మోహనరెడ్డి 2020లో రాజ్యసభ సభ్యుడుగా పంపారు.

హర్షం వ్యక్తం చేసిన ఎంపి మోపిదేవి

వైసీపీ ఆవిర్భావం తరువాత నియోజకవర్గంలో ఆ పార్టీ గెలవకపోయినప్పటికీ రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ డివిజన్ లో రేపల్లెతో పాటు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు కొనసాగనున్నాయి. కాగా రేపల్లెను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 74 రెవెన్యూ డివిజన్లు ఉండగా..ఇప్పుడు కొత్తగా రేపల్లె కూడా రెవెన్యూ డివిజన్ గా మారనుండటంతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75కు చేరుకోనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk