CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు కోనసీమ జీల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలలో జగన్ సర్కార్ వెనుకడుగు వేయడం లేదు. వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భాగంగా నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ఐ పోలవరం మండలం మురమళ్ల లో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి 10.45 గంటలకు మురమళ్ల వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
CM YS Jagan: లక్షా 32వేల కుటుంబాలకు లబ్ది
రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద వేట నిషేద సమయంలో పది వేల వంతున ఆర్ధిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నేడు 109 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంతే కాకుండా ఓఎన్జీసీ వద్ద పైపులైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు ప్రభుత్వం అందిస్తొంది. మొత్తం రూ.217 కోట్లను నేడు లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నారు.