CM YS jagan: సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెట్టింది ఏపి ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే, మంత్రి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంగతి. గౌతమ్ రెడ్డి అకాల మరణం అనంతరం జరిగిన సంస్మరణ సభలో సంగం బ్యారేజ్ కి గౌతమ్ రెడ్డి గౌరవార్ధం ఆయన పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ పేర్కొన్నట్లుగా ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?