CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన అంశాలపై మోడీకి వినతి పత్రం అందించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంశాలు, ప్రత్యేక హోదా, తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలు ఇలా పలు అంశాలను ప్రస్తావించారు సీఎం జగన్. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ఇవే సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ వినతి పత్రాలను ఇస్తూనే ఉన్నారు. కానీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంశాలు, ఇతర ప్రధాన సమస్యలపై మోడీ నుండి ఇంత వరకూ స్పష్టమైన హామీ రావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు తెలియజేసిన నేపథ్యంలో అయినా కొన్ని అంశాలపై అయినా నేరువేరుతాయోచూడాలి మలి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
CM YS Jagan: వినతి పత్రంలో ముఖ్యమైన అంశాలు ఇవీ
- రూ.34,125.5 కోట్ల రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలి
- తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలి
- పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలి
- జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలి
- భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు మంజూరు చేయాలి
- ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలి
- విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలి