CM YS Jagan: అమ్మఒడి పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ హజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగన్ సర్కార్ అమ్మఒడి పథకం నిధులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రారంభంలో 75 శాతం హజరు తప్పనిసరి అని నిబంధన పెట్టింది ప్రభుత్వం. అయితే కరోనా నేపథంలో పాఠశాలలను గత ఏడాది, ఈ ఏడాది మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా గత ఏడాది, ఈ ఏడాది అమ్మఒడి పథకానికి హజరు శాతం నిబంధనను తొలగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. మార్చి చివరి వారంలో కరోనా ప్రారంభం అయింది.
Read More: MAA Elections: మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్..! నిన్న నాగబాబు..నేడు ప్రకాశ్ రాజ్..! రేపు ఎవరో..?
CM YS Jagan: పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల హజరు శాతం
అమ్మఒడి పథకం అమలు చేసి రెండు మూడు నెలలు తిరగకముందే కరోనా ప్రారంభం కావడంతో పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరిగి 2020 నవంబర్, డిసెంబర్ నెలల్లో పాఠశాలలను తెరవడం జరిగింది. జనవరి 2021లో అమ్మఒడి పథకం నిధుల పంపిణీ జరిగింది. ఆ తరువాత కరోనా సెకండ్ వచ్చింది, దీంతో పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా గడ ఏడాది, ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం హజరు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. కాగా ఈ ఏడాది జూన్ లో పాఠశాలలు ప్రారంభించాల్సి ఉండగా ఆగస్టు 16న ప్రారంభించారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలల్లో హజరు శాతం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి ఆగస్టులో 73 శాతం ఉండగా, సెప్టెంబర్ లో 82 శాతంకు పెరిగింది. అక్టోబర్ నెలలో 85 శాతం నమోదు అయ్యింది.
అమ్మఒడి పథకానికి హజరు అనుసంధానం
విద్యాశాఖ పై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించగా ఈ లెక్కలను విద్యాశాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో హజరు 91 శాతం ఉందని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి పథకం స్పూర్తి కొనసాగించాలన్నారు. విద్యార్ధులను బడి బాట పట్టించాలన్నదే అమ్మఒడి పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. 2022 విద్యాసంవత్సరంలో అమ్మఒడి పథకానికి హజరుకు అనుసంధానం చేయాలని జగన్ ఆదేశించారు. అమ్మఒడి, విద్యాకానుక రెండు జూన్ లో పిల్లలు స్కూల్కి వచ్చేటప్పటికి అందించాలని చెప్పారు. ప్రధానంగా అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి హైస్కూల్ కు క్రీడామైదానం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.