CM YS Jagan: దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ నెల్లూరు జిల్లా గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. గౌతమ్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. గౌతమ్రెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్బంలో గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం వైఎస్ జగన్ ఓదార్చారు..
Read More: AP BJP: సోము వీర్రాజుకు బిగ్ ట్విస్ట్..! బెజవాడలో బీజేపీ సీనియర్ నేతల భేటీ..మేటర్ ఏమిటంటే..?
CM YS Jagan: గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా..
ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. చిన్నప్పటి నుంచి గౌతమ్ రెడ్డితో తనకు ఉన్న పరిచయాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. ప్రతి అడుగులోనూ గౌతమ్రెడ్డి తోడుగా ఉన్నారన్నారు. గౌతమ్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉందని అన్నారు. గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. చివరి క్షణం వరకు గౌతమ్ రెడ్డి రాష్ట్రాభివృద్ది కోసం శ్రమించారని జగన్ పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా కార్యక్రమం చేపడతామన్నారు. సంగం బ్యారేజీ పనులు మే 15 లోగా పూర్తి చేసి దానికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేయనున్నట్లు సీఎం జగన్ పునరుద్ఘాటించారు.
తొలుత సీఎం జగన్ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు వచ్చారు. సంతాప సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి తిరుగుప్రయాణం అయ్యారు.