CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది కూడా సమ్మర్ టూర్ కు విదేశాలకు వెళుతున్నారు. ప్రతి ఏడాది సతీమణి భారతితో కలిసి లండన్ వెళుతుంటారు. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలతో ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి సీఎం జగన్ .. కుటుంబ సభ్యుల కోసం ఏడాదిలో కొంత సమయాన్ని ( వారం పది రోజులు) కేటాయించడం అలవాటు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వేసవిలో విదేశీ పర్యటనకు వెళ్లారు. పాదయాత్ర లో ఉన్నప్పుడు మాత్రం ఆయన టూర్ కు వెళ్లలేదు. మిగిలిన ప్రతి ఏడాది వేసవిలో టూర్ కు వెళ్లడం జగన్ కు అలవాటు గా మార్చుకున్నారు. 2019 నుండి.. ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళ్లి వస్తున్నారు. ఈ ఏడాది కూడా జగన్ విదేశాలకు వేసవి సెలవుల్లో గడిపేందుకు బయలుదేరి వెళ్లనున్నారు.
లండన్ లో చదువుకుంటున్న కుమార్తెతో వేసవి సెలవులు గడిపేందుకు సీఎం దంపతులు ఈ నెల 21న బయలుదేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పర్యటన షెడ్యుల్ ఇంకా ఖరారు కాలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 21వ తేదీ నుండి వారం లేదా పది రోజుల పాటు ఆయన విదేశాల్లో కుటుంబ సభ్యులతో గడపనున్నారు. ఆయన సతీమణి భారతి రెడ్డి, కుమార్తెలు హర్షరెడ్డి, వర్షారెడ్డిలతో కలిసి వారం రోజులపాటు ఈ సారి కూడా విదేశాల్లో పర్యటించనున్నారని సమాచారం.
అయితే ఇది వ్యక్తిగత పర్యటన కావడంతో ఇంకా ఏ దేశానికి ఆయన వెళ్లనున్నారు అన్నది తెలియరాలేదు. కొద్ది రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది కుమార్తె డిగ్రీ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమంలో జగన్ దంపతులు ప్రత్యేకంగా హజరైయ్యారు. 2021 లో కుమార్తెల సమక్షంలో జగన్ దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నందున మరో సారి వెళ్లేందుకు సమయం కుదరదని భావిస్తున్న జగన్ .. ఇప్పుడే వెళుతున్నట్లు తెలుస్తొంది.
Election Commission: ఆ మూడు పార్టీలకు ఈసీ షాక్.. ఆప్ కు జాతీయ పార్టీ హోదా