CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు (శుక్రవారం) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. మర్యాదపూర్వక సమావేశం అని సీఎంవో కార్యాలయం చెబుతోంది. అయితే ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్ భవన్ కు రేపు సాయంత్రం జగన్ వెళుతున్నారని సమాచారం. ఈ సందర్భంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు గురించి గవర్నర్ హరిచందన్ కు జగన్ వివరించనున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపి ఆమోదం కొరకు గవర్నర్ కు పంపిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఆవిర్భావానికి ప్రభుత్వం 4వ తేదీన ముహూర్తం ఖరారు చేసింది.
CM YS Jagan: 11 న మంత్రివర్గ విస్తరణపై..
మరో పచ్చే వచ్చే నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కూడా గవర్నర్ హరిచందన్ తో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కావడంతో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్ లో నిర్వహించాలా లేక బయట ఏర్పాటు చేయాలా అనే దానిపై గవర్నర్ భేటీలో క్వారిటీ వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు ముందుగా ఈ నెల 7వ తేదీన ఈ కేబినెట్ చివరి భేటీ జరగనుంది.