AP Assembly: ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకు అందించే సంక్షేమ పథకాల క్యాలండర్ ను విడుదల చేశారు. ఏప్రిల్ నెల నుండి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ ఏయే నెలలో ఏ సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు పంపిణీ జరుగుతుందో వివరించారు సీఎం వైఎస్ జగన్.
- ఏప్రిల్ నెలలో వసతి దీవెన, వడ్డీ లేని రుణాలు
- మే నెలలో విద్యాదీవెన, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్స్యకార భరోసా
- జూన్ నెలలో అమ్మఒడి పథకం
- జూలై నెలలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు
- ఆగస్టు నెలలో విద్యా దీవెన, ఎంఎన్ఎంఈలకు ఇన్సెన్ టివ్, నేతన్న నేస్తం
- సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్ చేయూత
- అక్టోబర్ నెలలో వసతి దీవెన, రైతు భరోసా
- నవంబర్ నెలలో విద్యాదీవెన, రైతులకు వడ్డీ లేని రుణాలు
- డిసెంబర్ నెలలో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
- జనవరి నెలలో రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు పథకాలు
- ఫిబ్రవరి నెలలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు
- మార్చి నెలలో వసతి దీవెన
AP Assembly: 95 శాతం హామీలను నెరవేర్చాం
ఈ ఏడాది రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించామని వెల్లడించారు. మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చామనీ, కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదని అన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో టీడీపీ ఉనికి కోసం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాగా ఏపి బడ్జెట్ 2022 – 23ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ జనరంజకమైన బడ్జెట్ ను తీసుకువచ్చిందని ప్రభుత్వాన్ని అభినందించారు. పలు రకాల ప్రజా సమస్యలను సభ్యులు లేవనెత్తగా ప్రభుత్వం కూడా ఎంతో బాధ్యతగా సమాధానం చెప్పిందన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం
అనేక రకాలైన చట్టాలను తీసుకొచ్చిందని ప్రశంసించారు. అనంతరం సభను స్పీకర్ తమ్మినేని నిరవధికంగా వాయిదా వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?