AP High Court: కోర్టు దిక్కరణ కేసులో ఐఏఎస్ లపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2015 నాటి భూసేకరణకు సంబంధించి ఓ కోర్టు దిక్కార కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు ఏపి హైకోర్టులో ఊరట లభించింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్ లు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
భూసేకరణకు సంబందించి కోర్టు దిక్కార కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కు నాలుగు వారాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కి నెల రోజుల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, అప్పటి మరో కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్ వి చక్రధర్ లకు రూ.2వేల జరిమానా చొప్పున విధించిన సంగతి తెలిసిందే. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పును నాలుగు వారాల పాటు నిలుపుదల చేశారు. సింగిల్ బెంచ్ తీర్పుపై ఈ ఐఏఎస్ అధికారులు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా గురువారం కేసు విచారించిన ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. దీంతో ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది.
Read More: AP Govt: సుప్రీంలో ఏపి ప్రభుత్వానికి గట్టి షాక్..ఏకంగా లక్ష జరిమానా..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?