Corona : ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా మహమ్మారి భయపెడుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ స్టేజ్లో ఉండగా భారత్లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. క్రమంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక, తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా తాజా పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు వెల్లడించారు.
తెలంగాణలో డేంజర్ జోన్….
గతంతో పోలిస్తే సెకండ్ వేవ్ డేంజర్గా ఉందని హెచ్చరించిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమైనవిగా తెలిపారు. మున్ముందు ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా దొరకపోయే ప్రమాదం ఉందన్న ఆయన.. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి ఓవైపు వ్యాక్సినేషన్ పెంచిన సర్కార్.. మరోవైపు.. కరోనాబారిన పడకుండా.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత అవసరం అని మళ్లీ మళ్లీ చెబుతున్న సంగతి తెలిసిందే.
మంత్రి కీలక ప్రకటన….
ఊహించని రీతిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల పేర్కొన్నారు. మాస్కులు తప్పకుండా ధరించాలని కోరిన ఆయన ఇంకా కొన్ని రోజులు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుంది అని, అయితే లాక్ డౌన్ , కర్ఫ్యూ లు ఉండవని అన్నారు. పబ్ , క్లబ్బుల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలని ఈటల పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్నాయని, అందువల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎక్కువ మంది అసిమ్టమాటిక్ గా ఉంటున్నారని, తెలంగాణలో వాక్సినేషన్ వేగవంతం చేసేందుకు… ప్రతి రోజు లక్ష మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ నాన్ కోవిడ్ సేవలు అందుతాయని, ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపార కోణంలో కరోనా చికిత్స ను చూడొద్దని కోరారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?