Corona Cases: దేశంలో కరోనా మహామ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తొంది. దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకుపైగా చేరుకున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ (Covid Fourth Wave) ప్రారంభం అయ్యిందా అన్న భయం ప్రజల్లో వెంటాడుతోంది. శుక్రవారం ఉదయం నుండి శనివారం వరకూ 17,092 కొత్త కేసులు నమోదు అయ్యయి. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 14, 684 మంది కోవిడ్ నుండి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివిటీ రేటు 4.14 శాతం గా ఉంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదే క్రమంలో ఏపిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు అధికార వైసీపీలో కరోనా కలకలం రేపింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు కరోనా బారిన పడ్డారు. తాజా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మరో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం వీరు ఇద్దరు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తమను కలిసిన వాళ్లు అందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఇటీవల కాలం వరకూ పెద్దగా కేసులు నమోదు లేకపోవడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్క్ లు ధరించడం గానీ, భౌతిక దూరం పాటించడం గానీ చేయడం లేదు. వివిద రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు యధావిధిగా జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార వైసీపీ నేతలు .. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లో తిరుగుతుండగా, టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ఈ తరుణంలో కరోనా కేసులు పెరుగుతుండటం, నేతలు కరోనా బారిన పడుతుండటం కలకలాన్ని రేపుతోంది.