Corona: ఇదో షాకింగ్ న్యూస్. దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఆందోళనకరంగా ఉంది. కరోనా ఫస్ట్వేవ్ కల్లోలం సృష్టిస్తే సెకండ్ వేవ్ విశ్వరూపమే చూపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది ఇంతటి అయిపోలేదు.. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి సంచలన ప్రకటన
దేశంలో కేవలం కోవిడ్ సెకండ్ వేవ్ను మాత్రమే కాకుండా భవిష్యత్తులో థర్డ్, ఫోర్త్ వేవ్లు కూడా ఉంటాయని అందుకు సిద్ధమై ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి గడ్కరీ సూచించారు. ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆయన.. వైరస్ గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధాల కొరతను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని .. రెమ్డెసివిర్కు పెరుగుతున్న డిమాండ్ రీత్యా ఉత్పత్తిని కూడా పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ఇదే మన కేసుల షాకులు
ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో భారత్లో కోవిడ్ బారినపడి 3,293 మంది ప్రాణాలు వదిలారు. రోజువారీ మరణాల్లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక మరణాలు ఇవే.. దీంతో.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 2,01,187కు పెరిగింది.. ఇక, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ల్లో 73.59శాతం ఉన్నాయి.