టీడీపీ నేత పట్టాభికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు అరెస్టు అయిన టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. నిందితులకు 25 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. కాగా పట్టాభితో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలు అందరూ మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హజరుకావాలని కోర్టు షరతు విధించింది.
సీఐ కనకారావు తో పాటు ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభితో పాటు పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సహా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన ఈ కేసులో ప్రస్తుతం పట్టాభితో సహా నిందితులు అందరూ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఏపి అసెంబ్లీ సమావేశాలకు మూహుర్తం ఖరారు .. ఎప్పటి నుండి అంటే..?