CPI Narayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో గురువారం మెగా స్టార్ చిరంజీవి సహా పలువురు సినీ పెద్దలు భేటీ అవుతున్న నేపథ్యంలో సిపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక కామెంట్స్ చేశారు. సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం గురించి ఇటీవల చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత వివాదమైన విషయాన్ని గుర్తు చేస్తూ.. వాస్తవానికి సినీ ఛాంబర్ కుగానీ, నిర్మాతల మండలికి గాని సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సినీ పెద్దలు మాట్లాడితే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? అని ప్రశ్నించారు. రేపు చిరంజీవితో పాటు ఒకరిద్దరు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతారంటున్నారు.
CPI Narayana: వ్యకిగతంగా కలిస్తే ఉపయోగం ఉండదు
కానీ ఆ విధంగా సమస్య పరిష్కారం కాదని అన్నారు. మా అసోసియేషన్, సినీ ఛాంబర్ లు, ఏపీ ప్రభుత్వంతో కలిసి చర్చిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు నారాయణ. అలా కాకుండా వ్యకిగతంగా కలిస్తే ఉపయోగం ఉండదని అన్నారు. డివైడ్ అండ్ రూల్ పెట్టడం సరికాదని అన్నారు నారాయణ. పిఆర్సి విషయంలో ఎన్జీవోలకు డివైడ్ అండ్ రూల్ పెట్టారని, అలా పెట్టి ఎన్జీవోలను రకరకాలుగా, చిత్తుచిత్తుగా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు పిఆర్సి సమస్య రావణాసురుడి కాష్టంలా మండుతూనే ఉందని అన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతూ ఉంటే, ఏదో మేనేజ్ చేసి దానిని పరిష్కారం చేసినట్లుగా చూపారని అన్నారు. సినీ పరిశ్రమను కూడా అదే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా పారదర్శకంగా సమస్య పరిష్కారానికి దోహదపడాలే తప్ప, మేనేజ్ చేసే పద్ధతిలో ఉంటే సినీ పరిశ్రమలో కూడా ఇదే విధంగా సంక్షోభం వస్తుందని, రావణాసురుడు కాష్టంలా మండుతూనే ఉంటుందని పేర్కొన్నారు. దీనిని తెలుసు కొని రాష్ట్ర ప్రభుత్వం మసలుకోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!