CR Puram (Prakasam): సీఆర్ పురం మండలంలోని భైరవకోన వేంచేసి ఉన్న త్రిముఖ దుర్గాంబాదేవి ఆలయంలో శనివారం షాపులకు సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన ఈ వేలం పాటల్లో ప పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఇన్సపెక్టర్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ) నర్రా నారాయణ రెడ్డి వేలం పాటలను నిర్వహించగా, మొత్తం 11 షాపులకు గానూ ఏడు షాపులకు బహిరంగ వేలం పాట పాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సిద్దు రమణారెడ్డి, పలువురు పాటదారులు, వ్యాపారులు పాల్గొన్నారు.