Crime News: సహజంగా పెళ్లి రోజు ఎవరైనా భర్యకు చీర గానీ, లేదా బంగారు అభరణాలు గానీ లేక ఇంకా ఏదైనా వస్తువు బహుమతి ఇస్తారు. కానీ ఓ వ్యక్తి తన మొదటి పెళ్లి రోజు నాడు భార్యకు ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చాడు. దాంతో అతను కటకటాల పాలైయ్యాడు. బహుమతి ఇచ్చి కటకటాల పాలు అవ్వడం ఏమిటని అనుకుంటున్నారా ? అతను ఇచ్చి గిప్ట్ వింటే మీరు ఆశ్చర్య పోతారు. ఇంతకూ ఆయన తొలి ఏడాది పెళ్లి రోజుకు భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో చూద్దాం..
విషయంలోకి వెళితే.. కృష్ణాజిల్లా విసన్నపేట మండలంలోని చండ్రుపట్ల తండా పంచాయతీ పరిధిలోని కొర్ర తండాకు చెందిన కొర్ర దుర్గారావు అదే గ్రామానికి చెందిన లక్ష్మి (24)ని ప్రేమించి పెద్దల అనుమతితో గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన కొద్ది రోజులకే దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో తరచు గొడవలు పడుతున్నారు. గొడలు జరుగుతున్నప్పటికీ రీసెంట్ గా మొదటి సంవత్సరం పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అదే రోజు రాత్రి భార్య, భర్తల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దుర్గారావు మరీ రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టాడు.
Read More: TRS MP Nama Nageswara rao: టీఆర్ఎస్ ఎంపి నామా నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
అతను కొట్టిన దెబ్బలు ఆయువుపట్టుపై పడటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. దీంతో కంగారుపడిన దుర్గారావు నేరుగా విసన్నపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో అతనిపై దుర్గారావుపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. లక్ష్మి మృతదేహానికి తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను ఇలా పెళ్లి రోజే భార్యను కొట్టి చంపడం ఏమిటని గ్రామస్తులు అంతా విస్మయానికి గురి అయ్యారు. పెళ్లి రోజు భార్యకు మరణాన్ని గిఫ్ట్ గా ఇచ్చి కటకటాల పాలైయ్యాడని వ్యాఖ్యానిస్తున్నారు.