Mylavaram (NTR): టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దేవినేని ఉమాపై క్రిమిల్ కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలియడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న దేవినేని ఉమా నేతృత్వంలో టీడీపీ శ్రేణులు జగనాసుర చరిత్ర పేరుతో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కొండపల్లిలో సీఎం దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో దేవినేని ఉమామహేశ్వర రావు పే ఐపీసీ 149, 153, 505(2) సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీహార్ జైలులో గ్యాంగ్ వార్ .. గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియా హత్య