Cross Firing: విశాఖ ఏజన్సీ ఏరియాలో ఎదురు కాల్పులు కలకలం సృష్టించాయి. కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. వేకువజామున తీగమెట్ల వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మవోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి.
పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రేహౌండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించిన పోలీసులు.. ఎంత మంది చనిపోయారు? ఎంత మంది గాయపడ్డారు ? అనేది ఇంక తెలియరాలేదనని చెప్పారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగడంతో పూర్తి వివరాలు ఇంత వరకూ అందలేదు.
కాగా ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన మావోయిస్టు నేత సందె గంగయ్య మృతి చెందినట్లు సమాచారం, సంగయ్య డీసిఎం కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతని వద్ద ఏకే 47 లభించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసు అదనపు బలగాలను తరలిస్తున్నారు. మవోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని సమాచారం. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టారు.