Curfew: ఏపిలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరో పది రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటి సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హజరయ్యారు.
Read More: Corona Virus: భారత ప్రజలకు ఊరట కల్గించే విషయం ఇదీ..!!
ఈ సమావేశంలో కర్ఫ్యూ ను ఈ నెల 20వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పెంచారు. ఇప్పటి వరకూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు సమయాన్ని ఈ నెల 11వ తేదీ నుండి మధ్యాహ్నం 2గంటల వరకూ పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్చించి ఈ కీలక నిర్ణయాలను తీసుకున్నది.