రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెచ్చుమీరాయని, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీతో సహా హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్ధం ఆలయంలో కోదండ రాముడి విగ్రహం తలను నరికివేసిన ఘటన మరువక ముందే తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామనగర్ లో గల విఘ్నేశ్వరస్వామి ఆలయంలోని సుబ్రమణ్యస్వామి ఉపాలయంలో స్వామివారి విగ్రహం రెండు చేతులను దుండగులు నరికివేశారు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తరచుగా విగ్రహాల ధ్వంసంతో హింధువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటున్నారు. విగ్రహాల ధ్వంసంకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.
ఇంతకు ముందు అంతర్వేదిలో నర్శింహస్వామివారి రథం తగులబెట్టడం, ఆ తరువాత వరుసగా పలు ఆలయాల్లో జరిగిన ఘటనలపై బీజేపీతో సహా హింధూ సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఆలయాలపై జరుగుతున్న దాడులలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు పెరిగిపోతున్నాయని బీజెపీ నేతలతో సహా పలువురు భక్తులు పేర్కొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?