Darmana Prasada Rao: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మరో సారి జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. అవినీతి ఎక్కువగా ఉందనీ, ఇది అవమానకరమని అన్నారు. అందుకే ప్రభుత్వం అనేక పథకాలను లబ్దిదారులకు నేరుగా అందిస్తోందని వివరించారు. ప్రజలు నిజాయితీ కల్గిన నాయకులను కోరుకుంటున్నారని అన్నారు. అందునే ఒడిస్సాలో ప్రజలు నవీన్ పట్నాయక్ నాలుగు సార్లు ముఖ్య మంత్రిని చేశారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆయన నిజాయితీ వల్లనే సాధ్యమయ్యిందన్నారు. అదే విధంగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. నేతలు, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వంలో ఉన్న వారు నిజాయితీ పాలన అందించడమే తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు ధర్మాన ప్రసాదరావు.
Darmana Prasada Rao: శాశ్వత గృహ హక్కు పథకంపై అనవసర విమర్శలు
ఇదే క్రమంలో శాశ్వత గృహ హక్కు పథకం గురించి వివరించారు. రాష్ట్రంలో ఇంతకు ముందు ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లు పీఓటీ యాక్ట్ కింద ఉండేవన్నారు. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ యాక్ట్. అయినా చాలా మంది ఇళ్లను విక్రయించుకున్నారనీ, ఈ విక్రయాలు వివాదాలకు దారి తీస్తున్నాయని అన్నారు. అందుకే ఇలాంటి వివదాలు పరిష్కరించి యాజమానులకు హక్కు ఇచ్చేలా శాశ్వత గృహ హక్కు పథకం ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దీని వల్ల ప్రయోజనం పొందిన వారి అభిప్రాయాలు తెలుసుకోవాలనీ, విమర్శించడమే పని గా పెట్టుకున్న వారి మాటలు వినకూడదని అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదారావు.