ఏపి ప్రభుత్వ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా నిర్వహించే అర్బన్ క్లినిక్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్, యూపీహెచ్ సీ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసు పోస్టుల భర్తీకి గానూ అర్హులనుండి ప్రభుత్వం ధరఖాస్తులను ఆహ్వానించింది. ఖాళీగా ఉన్న 21 పోస్టులను ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకోనున్నట్లు తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 4, ఫార్మసిస్ట్ పోస్టులు ఆరు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు ఏడు ఖాళీల భర్తి చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ధరఖాస్తు చేసుకునే వారు పోస్టుకు తగిన విద్యార్హతకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పదో తరగతి, డీఎంఎల్టీ, బీఎస్సీ (ఎంఎల్టీ), డిగ్రీ, డిప్లొమా, డి ఫార్మసీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నది. 18 నుండి 42 సంవత్సరాల వయసు మద్య ఉండాలనీ, సంబంధిత పనిలో అనుభవం కూడా కల్గి ఉండాలని తెలిపింది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోగా పోస్టు ద్వారా పంపించాలని వెల్లడించింది.
విద్యార్హతలు, అనుభవం, రిజిస్ట్రేషన్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక నిర్వహిస్తారు. నెలాఖరులోగా సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించి మెరిట్ లిస్టును డిసెంబర్ 5న విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులకు డిసెంబర్ 7న నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ధరఖాస్తులను మేనేజ్ మెంట్ యూనిట్ (డీసీఎంయూ), నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (డాక్టర్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్, యూపీహెచ్ సీ), తూర్పు గోదావరి జిల్లా, ఏపి అడ్రస్సుకు పంపించాలి.
Fire Accident: అగ్ని ప్రమాదంలో తండ్రీకొడుకులు సజీవ దహనం ..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు