రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో అధికారిపైనా వేటు వేశారు. ఏపి ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణి మోహన్ ను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు మంగళవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ కు లేఖ రాశారు. కార్యాలయం నుండి వాణిమోహన్ ను రిలీవ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ముందస్తు అనుమతి లేకుండా 30 రోజులు లీవు పెట్టి వెళ్లిన ఎన్నికల సంఘం కార్యాలయ జెడి సాయి ప్రసాద్ పై నిన్న నిమ్మగడ్డ వేటు వేసిన సంగతి తెలిసిందే. కార్యాలయంలో మరి కొందరు ఉద్యోగులు కూడా సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ మద్య వైరం కొనసాగుతున్న నేపథ్యంలో కార్యాలయ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..ఏపి ఎన్నికల సంఘం జేడీపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేటు..