ఏపి andhra pradeshలో గత నెల 25వ తేదీ క్రిస్టమస్, వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy ఇళ్ల పట్టాల (house sites)పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31లక్షల మంది లబ్దిదారులకుపైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో జనవరి 10వ తేదీ నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని తొలుత భావించారు. అయితే ఇప్పటి వరకూ 39 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ మాత్రమే జరిగింది. 17వేలకు పైగా కాలనీల్లో 9,668 వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది.
ఈ నేపధ్యంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగించనున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు. ఏపి చరిత్రలో ఇది ఒక పెద్ద కార్యక్రమమని జగన్ అన్నారు. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందనీ, లబ్దిదారుల దీవెనలు లభిస్తాయనీ అన్నారు. లే అవుట్ లలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయడం ఒక కార్యక్రమం అయితే వాటిలో మౌలిక సదుపాయలు కల్పించడం మరొక కార్యక్రమమని అన్నారు. రోడ్లు, కరెంటు, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలతో పాటు పాఠశాలలు, అంగన్ వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్ లాంటివి ఏర్పాటు చేయాలనీ, కాలనీ పరిమాణం, జనాభా దామాషా ప్రకారం వీటిని ఏర్పాటు చేయాలని సీఎం కలెక్టర్లకు తెలిపారు.