NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ దైవం న్యూస్ రాజ‌కీయాలు

BJP : బీజేపీ కి అదిరిపోయే షాకిచ్చిన జ‌గ‌న్ ?

BJP : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌పై క‌త్తులు దూస్తున్న బీజేపీ నేత‌ల‌కు అదిరిపోయే షాకిచ్చార‌ని అంటున్నారు.

does-jagan-surprising-talk-to-bjp
does-jagan-surprising-talk-to-bjp

 

గ‌త కొద్దికాలంగా ఏ అంశంలో అయితే త‌న‌ను ఇర‌కాంట‌లో ప‌డేస్తున్నారో…. స‌రిగ్గా అదే అంశంలో వారిని ఎదురుదాడి చేశారని చెప్పుకొస్తున్నారు. ఇది హిందు దేవాల‌యాల ఉదంతం. గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న దుర్ఘ‌ట‌న‌ల మ‌చ్చ ను తొల‌గించుకునేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ సార‌థ్యంలోని స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

BJP : ఒకే రోజు రెండు కీల‌క నిర్ణ‌యాలు ….

పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను రాజ్యసభలో ప్రస్తావించారు. ఏడాదికాలంలో 140 ఘటనల్లో దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. రామతీర్థంలో రాముడు విగ్రహం తల తొలగించడం, అంతర్వేధిలో రథం దగ్ధం వంటి ఘటనలు జరిగినా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. వ్యక్తులపై రాజకీయ ఆరోపణలు చేస్తోందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నప్రభుత్వం.. దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని కామెంట్ చేశారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని జీవీఎల్‌ కోరారు.

జ‌గ‌న్ టీం సంచ‌ల‌న నిర్ణ‌యం ?

మ‌రోవైపు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో విడ‌త‌లో 500 ఆల‌యాల నిర్మాణానికి స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్, సంస్కృతి సంవ‌ర్ధిని సంస్థ‌ల ద్వారా శ్రీ‌కారం చుట్టాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్, తెలంగాణ‌లో సంస్కృతి సంవ‌ర్ధిని సంస్థ‌ల ద్వారా 500 ఆల‌యాల నిర్మాణానికి అనుమ‌తి కోసం రాబోయే కార్య‌వ‌ర్గ‌ స‌మావేశానికి ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని ఈవో చెప్పారు. నూత‌నంగా నిర్మించే ఒక్కో ఆల‌యానికి టిటిడి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌మ‌కూర్చ‌నుంద‌ని ఈవో వెల్ల‌డించారు. ఆల‌యాల నిర్మాణానికి అనువైన స్థ‌లం ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆ రెండు సంస్థ‌ల‌కు అప్ప‌గించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదివ‌ర‌కే టిటిడి నిర్మించిన 500 ఆల‌యాల్లో క‌ల్యాణోత్స‌వం ప్రాజెక్టు ద్వారా శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వ‌హించాల‌న్నారు.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju