BJP : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై కత్తులు దూస్తున్న బీజేపీ నేతలకు అదిరిపోయే షాకిచ్చారని అంటున్నారు.
గత కొద్దికాలంగా ఏ అంశంలో అయితే తనను ఇరకాంటలో పడేస్తున్నారో…. సరిగ్గా అదే అంశంలో వారిని ఎదురుదాడి చేశారని చెప్పుకొస్తున్నారు. ఇది హిందు దేవాలయాల ఉదంతం. గత కొద్దికాలంగా జరుగుతున్న దుర్ఘటనల మచ్చ ను తొలగించుకునేందుకు ఏపీ సీఎం జగన్ సారథ్యంలోని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
BJP : ఒకే రోజు రెండు కీలక నిర్ణయాలు ….
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను రాజ్యసభలో ప్రస్తావించారు. ఏడాదికాలంలో 140 ఘటనల్లో దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. రామతీర్థంలో రాముడు విగ్రహం తల తొలగించడం, అంతర్వేధిలో రథం దగ్ధం వంటి ఘటనలు జరిగినా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. వ్యక్తులపై రాజకీయ ఆరోపణలు చేస్తోందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నప్రభుత్వం.. దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని కామెంట్ చేశారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని జీవీఎల్ కోరారు.
జగన్ టీం సంచలన నిర్ణయం ?
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో విడతలో 500 ఆలయాల నిర్మాణానికి సమరసత సేవా ఫౌండేషన్, సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా శ్రీకారం చుట్టాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో సమరసత సేవా ఫౌండేషన్, తెలంగాణలో సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి అనుమతి కోసం రాబోయే కార్యవర్గ సమావేశానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈవో చెప్పారు. నూతనంగా నిర్మించే ఒక్కో ఆలయానికి టిటిడి రూ.10 లక్షల వరకు సమకూర్చనుందని ఈవో వెల్లడించారు. ఆలయాల నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేసే బాధ్యతను ఆ రెండు సంస్థలకు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే టిటిడి నిర్మించిన 500 ఆలయాల్లో కల్యాణోత్సవం ప్రాజెక్టు ద్వారా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలన్నారు.