KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల విషయంలో పొరపొచ్చాలు ప్రారంభం అయ్యాయా? కేంద్రం నిర్ణయంతో ఇటు తెలంగాణ అటు ఏపీ సర్కారు గుర్రుగా ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీకాలను రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని చెప్పేసిన కేంద్రం…18 ఏళ్లు దాటిన వారి టీకాలను కోసం రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసుకోవాలని కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలపై భారీగా ఆర్ధిక భారం పడనుంది.
పాలకుల ఫీలింగ్ ఇది…
కేంద్రం తీరుపై ఇటు తెలంగాణ అటు ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆదాయాలు తగ్గి.. ఖర్చులు అధికారులు పెరిగాయంటున్నారు. రాష్ట్రాలకు చేయూతనివ్వాల్సిన సమయంలో కేంద్రం చేతులెత్తేసిందనే చర్చ జరుగుతోంది. కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కరోనా వ్యాక్సిన్ భారం పడనుంది. సుమారు రూ.1500 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల ఆర్ధిక భారం పడుతుందని ఆర్ధిక శాఖ అంచనా వేసింది.
మంత్రి ఈటల ఫైర్
అయితే, ఏపీ ప్రభుత్వం వలే కాకుండా తెలంగాణ సర్కారు నేరుగా తన అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి తీసుకుందని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇది చాలా బాధాకరంగా ఉందని..కేంద్రం నిర్ణయానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన రెమిడిసివేర్ మాకు అవసరం ఉన్నంత ఇవ్వాలని దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు. రెమిడిసివేర్ కొరత రాకుండా.. 4 లక్షల వైల్స్ కి ఆర్దర్ పెట్టామని.. హైదరాబాద్ కు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక పేషేంట్లు వస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల వారికి వైద్యం చేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం తీరుపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని.. కేంద్రం కొంటె ఒక ధర… రాష్ట్రం కొంటె ఒక ధర పెట్టడం ఏంటి ? అని నిప్పులు చెరిగారు.