DR Sudhakar: గత ఏడాది సస్పెన్షన్కు గురైన విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సుధకర్ కొద్దిసేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు. గత ఏడాది కరోనా సమయంలో ఆసుపత్రుల్లో వైద్యులకు మాస్కులు లేవంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సుధాకర్ ప్రభుత్వ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యారు.
ఆ తరువాత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అర్థనగ్నంగా తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, దాంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన మానసిక స్థితిసరిగా లేదంటూ ప్రభుత్వం మానసిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించింది. సుధాకర్ కేసు వ్యవహారంపై ఆయన తల్లి హైకోర్టు ను ఆశ్రయించగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించించి. సీబీఐ దర్యాప్తు జరిపి హైకోర్టుకు నివేదిక అందజేసింది. ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. నేడు ఆయన గుండె పోటుతో మృతి చెందారు.