CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి 1998 డీఎస్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలిపారు. తమ 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని అభ్యర్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలువురు 1998 డీఎస్సీ అభ్యర్ధులు కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్ధులతో పాటు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
1998లో డీఎస్సీ రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూసి ఆశలు వదిలివేసుకున్న తరుణంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఉద్యోగాలు రావనే నిర్ణయానికి వచ్చేసిన నాటి అభ్యర్ధులు వేరువేరు వృత్తులు, వ్యాపారాలు, ఇతరత్రా వ్యాపకాల్లో స్థిరపడ్డారు. అయితే 1998 డీఎస్సీ క్వాలిఫై అయిన 4567 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వీరికి కొత్త ఊపిరి వచ్చినట్లు అయ్యింది.
1998లో డీఎస్సీ అభ్యర్ధుల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. నాడు ఉద్యోగం రాకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొందరైతే చాలా దీనావస్థలో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 24 ఏళ్ల సమస్యను నేడు సీఎం జగన్ పరిష్కరించడంతో అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.