చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు తీవ్ర కలకలాన్ని సృష్టించింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో వెనుక వైపు ఉన్న భవనంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన కారణంగా పోలీస్ స్టేషన్ భవనం కిటికీలు, తలుపుల అద్దాలు ధ్వంసమైనట్లు వార్తలు వినబడ్డాయి. అదే విధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. నాటు బాంబాలు పేలాయేమో అని భావించారు. ఘటన జరిగిన సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బంది ఆందోళనకు గురైయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనపై ఆార తీశారు. సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు సెర్కులేట్ కావడంతో పోలీస్ స్టేషన్ లో పేలుడుపై డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు.
2018 జూన్ లో జరిగిన ఓ కేసుకు సంబంధించిన సీజ్ చేసిన గన్ పౌడర్ ను నాశనం చేశామనీ, అయితే ఎఫ్ఎస్ఎల్ కు ఉపయోగించిన అందులో కొంత భాగాన్ని పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింద భాగంలో పూడ్చిపెట్టారని డీఎస్పీ చెప్పారు. అందుకే మర్రి చెట్టు వద్ద చిన్న పాటి పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ పేలుడు వల్ల ప్రజలకు గానీ, పోలీసు సిబ్బంది కి గానీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. పోలీస్ స్టేషన్ కు గానీ, ఆవరణలో వాహనాలకు గానీ ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ఇది చాలా చిన్నపాటి పేలుడనీ, ఎలాంటి రోమర్స్ నమ్మవద్దని ఆయన వెల్లడించారు.
Read More: అవార్డులు సాధించిన ప్రజ-ా ప్రతినిధులు, అధికారులను అభినందించిన సీఎం జగన్