Mantralayam: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి పూజలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి శ్రీ సుభధేంద్ర తీర్ధులు ఆధ్వర్యంలో మంగళవారం ద్వాదశి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీమూల రామదేతలకు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇచ్చారు. భక్తులు ముందుగా గ్రామ దేవత శ్రీమంచాలమ్మను దర్శించుకున్నారు.
అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్ధం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు.
NCP: పార్టీ శ్రేణుల ఒత్తిడితో పునరాలోచనలో ఎన్సీపీ నేత శరద్ పవార్