ఏపిలోని రెండు జిల్లాల్లో భూ ప్రకంపనలు ప్రజలను హడలెత్తించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, పరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అనేక గ్రాామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు గుర్తించారు.
ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఇళ్లల్లో నుండి ప్రజలు బయటికి పరుగులు తీశారు. మరో పక్క ప్రకాశం జిల్లా పామూరు మండలంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. పామూరు, పరిసర గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లు స్వల్పంగా కుదుపులకు గురి కావడంతో ప్రజలు ఆందోళన గురైయ్యారు.