Earthquake: ఇటీవల నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు మరువక ముందే ఏపిలోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జిరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. 15 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించిందని సమాచారం. గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతంలో భూమికంపించింది. భూప్రకంపనల కారణంగా పలు ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.