Eatela Rajendar: రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అనే మాటకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఓ ఉదాహరణ. టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరు అనే గుర్తింపు నుంచి ఇప్పుడు అదే పార్టీకి చెందిన గల్లీ లీడర్ కూడా టార్గెట్ చేసే వరకు ఆయన చేరిపోయారు. ఉత్కంఠభరిత పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రూటు బీజేపీ వైపు సాగుతోందని స్పష్టమైంది. అయితే, ఈ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: Eatela Rajendar: ఈటలకు వెన్నుపోటు రుచి చూపిస్తున్న కేసీఆర్
షర్మిల రెడీ…
తెలంగాణలో రాజకీయ పార్టీని నెలకొల్పి తన సత్తా చాటుకునేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో పార్టీని పెట్టబోతున్నట్లు ఇప్పటికే ఆమె ప్రకటించారు కూడా. కొత్త పార్టీని ఇప్పటికే ప్రకటించిన వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. వైఎస్ఆర్ పుట్టి రోజు అయిన జులై 8 వ తేదీన పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నామని పేర్కొన్న షర్మిల తమ పార్టీ జెండా మరియు అజెండా అన్నింటిని అదే రోజున ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: Eatela Rajendar: స్పీకర్ ఫార్మాట్లో ఈటల రాజీనామా చేయనిది ఇందుకేనా?
ఈటల… ఎందుకిలా?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేసులకు భయపడి బీజేపీలో చేరుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారిపై అక్రమ కేసులు పెట్టడం కామన్ అయిందని షర్మిల ఆరోపించారు. తమ పార్టీలోకి వస్తామంటే ఈటల రాజేంర్ను తప్పకుండా ఆహ్వనిస్తామని పేర్కొన్న షర్మిల ఇప్పటి వరకు ఈ విషయంపై ఈటలతో చర్చించలేదని తెలిపారు. కాగా, ఈటల రాజేందర్ షర్మిల ఏర్పాటు చేయబోయే సంగతి పార్టీలో చేరడం సంగతి అలా ఉంచితే.. అందుకు సంబంధించి చర్చలు జరిపినా….అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.