Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పక ముందు ఎంతగా వార్తల్లో నిలిచారో పదవికి రాజీనామా చేశాక సైతం అదే రీతిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీపై ఈటల చేస్తున్న విమర్శలు, ఆయనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సమయంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More: Eatela Rajendar: ఈటలకు వెన్నుపోటు రుచి చూపిస్తున్న కేసీఆర్
ఈటల రెండో సీఎంలా…
TRS నుంచి ఈటల బయటకు వెళ్ళి తన బొంద తానే పెట్టుకున్నాడని బస్వరాజు సారయ్య మండిపడ్డారు. ఈటలను రెండో సీఎంగా, సొంత తమ్ముడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకున్నారన్నారని ఆయన తెలిపారు. కష్టపడి గెలిపించిన టీఆర్ఎస్ నాయకులను కాదని, తండ్రి లాంటి కేసీఆర్ ను ధిక్కరించి పోయారన్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ మత తత్వ పార్టీ అని ఆయన ఆరోపించారు. రెచ్చగొట్టే, విభజించి పాలించే పార్టీ బీజేపీ అని విరుచుకుపడ్డారు. కేసీఆర్ను, TRSనే అందరం నమ్ముకోవాలని ఆయన కోరారు.
Read More: Eatela Rajendar: ఈటలకు వెన్నుపోటు రుచి చూపిస్తున్న కేసీఆర్
ఉత్కంఠ కొనసాగిస్తున్న ఈటల
మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసే విషయంలో ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలని భావిస్తున్న ఈటల రాజేందర్ ఇందులో భాగంగా మంచిరోజు కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. మరోవైపు స్పీకర్ అపాయింట్మెంట్ దొరకకపోవడం వల్లే ఆయన రాజీనామా పెండింగ్లో పడిందని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్లో తమ వ్యూహాలను అమలు చేస్తోంది.