ED: స్కీల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ అభియోగాల నేపథ్యంలో డిజైన్ టెక్ సిస్టమ్స్ కు చెందిన రూ.31,20 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగినట్లు ఏపి సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తొంది. డిజైన్ టెక్ మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు గుర్తించిన ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణానికి సంబంధించి ఏపి సీఐడీ నమోదు చేసి కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. డొల్ల (షెల్ ) కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లుగా విచారణ లో వెల్లడైంది. ఇప్పటికే డిజైన్ టెక్ ప్రతినిదులు వికాస్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ ను ఈడీ అరెస్టు చేసింది. డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ (డీటీఎస్ఎస్ఫీ) కు చెందిన రూ.31,20 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లుగా శుక్రవారం ఈడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?