YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివేకా హత్య కేసులో పలువురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన సీబీఐ.. సూత్రధారులు, సాక్షాధారాలు తారుమారు చేసిన వారిపై ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారి పూర్తి విషయాలను తెలియజేయడంతో సీబీఐకి దర్యాప్తు సునాయాసం అయ్యింది. ఈ హత్య కేసులో ప్రధానంగా రూ.40 కోట్లు సుపారీ అంశం బయటకు రావడం, దస్తగిరికి అందిన కోటి రూపాయలలో కొంత నగదును మున్నా అనే అతని వద్ద సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
YS Viveka Case: రూ.40కోట్ల సుపారీ అంశంపై
రూ.40కోట్ల సుపారీ అంశం వెలుగు చూడటంతో ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేయాలంటూ టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు గత ఏడాది నవంబర్ నెలలోనే ఈడీకి ఫిర్యాదు అందజేశారు. వివేకా హత్య కేసులో ఓ పక్క సూత్రధారులను పట్టుకునేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఈడీ కూడా రంగ ప్రవేశం చేసి నగదు లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
YS Viveka Case: రంగంలోకి ఈడీ
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తాజాగా రవీంద్రారెడ్డి వివేకానంద రెడ్డి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగిందని ఆయన తెలిపారు. ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. రూ.40 కోట్లు సుపారీ ఇస్తానని చెప్పింది ఎవరు.. ఎవరెవరికి ఎంత ఎంత ముట్టాయి. ఈ నగదు ఎవరిని నుండి ఎవరి వద్దకు ఎలా చేరాయి అనేది ఇడీ దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది.