NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేన ఉండగా మరో పార్టీ ఎందుకు..? ఎవరి కోసమంటూ హరిరామ జోగయ్య సంచలన కామెంట్స్..!!

Janasena: ఇటీవల హైదరాబాద్ లో వివిధ రాజకీయ పార్టీల్లోని కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం, అదే క్రమంలో ముద్రగడ పద్మనాభం ఎస్సీ, బీసీ నేతలతో సమావేశం నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ముద్రగడ పద్మనాభం దళిత, బీసీ, కాపు సోదరులు రాజ్యాధికారం కోసం చైతన్యవంతం కావాలంటూ బహిరంగ లేఖ రాశారు. ఈ వర్గాలను కలుపుకుని ముద్రగడ రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై మాజీ ఎంపి., కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఉండగా, మరో పార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే  అది వైసీపీ వ్యూహంలో భాగమేనని ఆరోపించారు. హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతల్లో పార్టీ పెట్టి నడిపే శక్తి ఎవరికీ లేదన్న హరేరామ జోగయ్య.. జనసేనను కాదని పార్టీ పెడితే కాపు ఓట్లు చీలడం కోసమేనని అభిప్రాయపడ్డారు.

ex mp hari rama jogaiah Janasena
ex mp hari rama jogaiah Janasena

 

నేతల్లో లోపించిన ఐక్యత

“మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది” అన్న సామెత మాదిరిగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ ఉన్నప్పటికీ ఐక్యత లోపించిందని ఆ సామాజికవర్గ నేతలే అంగీకరిస్తున్నారు. మరో పక్క జనసేనతో పొత్తు పెట్టుకుని దూరమైన కాపు సామాజికవర్గాన్ని దగ్గరకు చేసుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుండగా, ఈ కూటమికి కాపు సామాజికవర్గం దగ్గర కాకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, ఆ క్రమంలోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి.

Janasena: 2019 ఎన్నికల్లో వైసీపీ మద్దతుగా

రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజికవర్గ ఓట్లే కీలకం కానున్నాయి. 2014 ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం టీడీపీని కాపు కాయడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి టీడీపీకి జనసేన దూరం కావడంతో మెజార్టీ కాపు సామాజికవర్గ నేతలు వైసీపీ మద్దతుగా నిలిచారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిస్తే మళ్లీ చంద్రబాబుతో కలుస్తారన్న భావనతో ఉన్న ఆ సామాజికవర్గ నేతలు వైసీపీకి కాపు కాశారు. మరో పక్క జనసేన అభ్యర్ధుల ప్రభావం వల్ల కూడా 30కిపైగా స్థానాల్లో వైసీపీ గెలిచింది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా వంగవీటి రాధాను పార్టీలోకి చేర్చుకోవాలన్న ప్రయత్నం వైసీపీ చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju