EX MP Undavalli:దేశంలో రాజకీయ పరిణామాలపై మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటాయి కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీకే మద్దతు ఇస్తుంటాయనీ, ఆ పార్టీని ఒక్క మాట కూడా అనవు అని అన్నారు. చదువుకున్న వాళ్లు కూడా సంకుచితంగా ఆలోచన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకువచ్చి వివాదం చేయడం మంచిది కాదని అన్నారు. అసలు మనం ఎటు వెళుతున్నామో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. ఇతర దేశాల వారు మన సంప్రదాయాలను అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మనల్ని గౌరవిస్తొందన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దేశంలో కాంగ్రెస్, ఇతర పార్టీలలోని వారు బీజేపీలోకి వెళ్లడం ఆశ్చర్యం కల్గిస్తొందని ఉండవల్లి అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్లు కూడా ఆ పార్టీలో చేరుతున్నారన్నారు. బీజేపీ సిద్ధాంతాలు తెలియకుండా పదవుల కోసం ఆ పార్టీలోకి వెళుతున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో బీజేపీ ఫెయిల్యూర్ అయ్యిందనీ, అయితే మతం విషయంలో సక్సెస్ అయ్యిందన్నారు. ఆ పార్టీ సిద్ధాంతం వల్ల నష్టమే ఎక్కువ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉండవల్లి. కాంగ్రెస్ పార్టీది సెక్యులరిజం, కమ్యూనిస్టులది సోషలిజం, బీజేపీది హిందూయిజం సిద్ధాంతాలని అని పేర్కొన్నారు.