Breaking: వైఎస్ఆర్ జిల్లా కొండాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద లారీ, తుఫాను వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి ప్రాంతానికి చెందిన వారు తుఫాను వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. తాడిపత్రి వైపు నుండి వస్తున్న లారీ తుఫాను వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది.
మృతులు అందరూ తాడిపత్రి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండటంతో ఆ ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది. మరి కొద్దిసేపటిలో స్వగ్రామానికి చేరుకోవాల్సి ఉండగా, ఈ ఘోర ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి ఏడుగురు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ .. చంద్రబాబు నివాసం అటాచ్