TDP Leader: గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పైనా కేసు నమోదు అయ్యింది. దూళిపాళ నరేంద్ర పై కేసు నమోదు అరెస్టు అయిన గంటల వ్యవధిలో అదే జిల్లాకు చెందిన మరో టీడీపీ మాజీ మంత్రి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కేసు నమోదు కావడం జిల్లాలో తీవ్ర సంచలనం అయ్యింది. ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి చైర్మన్ నిమ్మగడ్డ ఉపేంద్ర నాధ్ ను బెదిరించారన్న అభియోగంపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన 448,170-2021 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మంగళగిరిలో ఉన్న ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రికి సంబంధించిన వివాదమే ఈ కేసుకు కారణంగా భావిస్తున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోదరుడు రవి గతంలో ఎన్ ఆర్ ఐ పాలకవర్గంలో సభ్యుడుగా ఉన్నారు,. అయితే పాలకవర్గంలో వచ్చిన విబేధాల నేపథంలో డైరెక్టర్ పదవి నుండి రాజేంద్ర ప్రసాద్ సోదరుడు రవిని తొలగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేంద్ర ప్రసాద్ తన సోదరుడు రవిని తిరగి డైరెక్టర్ గా తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఏదుర్కోవాల్సి ఉంటుంది అంటూ బెదిరించారని నిమ్మగడ్డ ఉపేంద్ర నాథ్ బెదిరించారని మంగళిగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.