Fire Accident : కర్నూలు జిల్లా నంద్యాల చెక్ పోస్టు వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెక్ పోస్టు సమీపంలో ఉన్న ఓ హోటల్ లో మూడు గ్యాస్ సిలెండర్ లు పేలడంతో భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చెక్ పోస్టు సర్కిల్ పక్కనే ఉన్న గుడిసెలు దగ్దమయ్యాయి. ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్, షాపులకు కూడా వ్యాపించాయి.
పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ప్రమాదం జరిగిన హోటల్ మూడు రోజులుగా మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హోటల్ లో 16 సిలెండర్ ఉండటంపై పోలీసులు హోటల్ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంతో నంద్యాల, నందికొక్కూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.