కడప జిల్లా తుమ్మనపల్లి యురేనియం కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి కర్మాగారం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభివించిందని తెలుస్తోంది.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.