Breaking: విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి జార్ఖండ్ కు ఆక్సిజన్ సిలెండర్ల లోడ్ లో వెళుతున్న లారీ నుండి మంటల ఎగిసిపడ్డాయి. సిలెండర్ లను మంటలు ఎగిసిపడటంతో లారీని రోడ్డు పక్కన నిలుపుదల చేసి డ్రైవర్, క్లీనర్ భయంతో పరారైయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది అగ్ని మాపక శకటంతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల కొద్ది సేపు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు.
నవీన్ హత్య కేసులో కీలక అప్ డేట్ .. ఆ అమ్మాయి ప్రమేయంపై సీపీ ఇచ్చిన క్లారిటీ ఇది