Breaking: శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ లో మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న బ్యాటరీ, పెయింట్ షాపులకూ మంటల వ్యాపించాయి. బైక్ షోరూమ్, పెయింట్ షాపు, బ్యాటరీ దుకాణాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. సమాచారం తెలియడంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు తెలియరాలేదు. ఆస్తి నష్టం రూ.10లక్షలకు పైగా ఉంటుందని అంచనా. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు.
సేఫ్ జోన్ లో ఈ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు..? వారు మాత్రం పని తీరు మార్చుకోవాల్సిందే..!