Fire Accident: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 52 రోజులుగా జీవీఎంసీ వద్ద దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం దీక్షా శిబిరం అగ్నికి ఆహుతి అయ్యింది. దీక్షా శిబిరం నుండి ఈ వేకువజామున మంటలు చెలరేగడం చూసిన పాదచారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారా ? అనేది పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. శిబిరం వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదనీ, ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.