Breaking: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లోని కిచెన్ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామన జరిగింది. మంటలు గమనించిన రైలు లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించి గూడూరు రైల్వే స్టేషన్ వద్దకు తీసుకువచ్చి నిలుపుదల చేశారు. రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు.
ఈ మంటల్లో కిచెన్ బోగీ సగానికిపైగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదం కారణంగా గూడూరు రైల్వే స్టేషన్లో రైలు గంటపాటు నిలిచిపోయింది. మంటలు ప్రయాణీకుల బోగీలకు వ్యాపించకుండా అదుపు చేయడంతో అందరూ అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆస్తినష్టం మాత్రమే సంభవించిందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసిన తర్వాత అధికారులు రైలును తనిఖీ చేశారు. అనంతరం నవజీన్ ఎక్స్ ప్రెస్ చెన్నైకి బయలుదేరింది.
కలుషిత ఆహారంతో 28 మంది విద్యార్ధినులు అస్వస్థత .. తల్లిదండ్రులు ఆందోళన..ఎక్కడంటే..?