Electric Shock: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు విద్యుత్ షాక్ తో సజీవ దహనం అయ్యారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడిపోయాయి. దీంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఆటోలో 13 మంది ఉండగా అయిదుగురు సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఆటోపై ఇనుప సామాన్లు ఉండటంత ఈ ఘటన సంభవించినట్లు భావిస్తున్నారు. మృతి చెందిన వారిది తాడిమర్రి మండలం గడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. గ్రామానికి చెందిన అయిదుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంతో గడ్డంపల్లి గ్రామంలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు చేరుకుని విచారణ ప్రారంభించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇలాంటి ఘటనే ఆరు రోజుల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు బైక్ పై పొలానికి వెళుతుండగా విద్యుత్ వైరు తెగి వీరి మీద పడటంతో ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. విద్యుత్ వైర్లు తెగి పడి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ముందస్తు మరమ్మత్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?